Monday, 3 February 2014

Sree Malyadri LakshmiNarasimha swami



Malakonda,
Prakasam(District),
Andhrapradesh (State),
India.

శ్రీమన్నారాయణ స్వామి అవతారమే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి.

          ఒక రోజు శ్రీమన్నారాయణ స్వామి పాల సముద్రంలోని శేషపాన్పుపై ఉన్నాడు తన పాదాల వద్ద శ్రీ మహాలక్ష్మి కూర్చుని ఉంది. శ్రీమన్నారాయణ స్వామి, శ్రీ మహాలక్ష్మితో  అన్నాడు 'ఇప్పుడు ని మదిలో ఎమన్న ఉంటే నాతో చెప్పు నీకోసం నేను చేస్తాను'. వెంటనే లక్ష్మిదేవి అన్నారు 'మీరు నాకు భర్తగా లబించారు, అదే నాకు మహాబాగ్యం. కానీ ప్రస్తుతం భూలోకంలో దైవక్షేత్రాలు చాలా తక్కువ ఉన్నవి, అందు చేత భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన భక్తులు కొరకు ఒక దైవక్షేత్రం నిర్మించండి'.

          స్వామి 'వనములను(వనదేవతను)' అందమైన పర్వతాలను భూలోకంలో సృస్టించమని 'వనములను(వనదేవతను)'  కోరాడు. అడగకనే దక్కిన వరంచేత మురిసెను. స్వామి కోసం పూల మాల ఆకారంలో పర్వత మాలను సృస్టించెను. అందు చేత ఆ దైవక్షేత్రానికి మాల్యాద్రికొండ (మాలకొండ) అనే పేరు వచింది. ఆగస్త్య మహముని ఈ మాల్యాద్రి పై తపస్సు చెసాడు ఆ తపస్సుకు మెచ్చి ఎర్రని కాంతి తో జ్వలారుపమున స్వామి ప్రత్యక్షమైనాడు అందువలన ఈ స్వామి జ్వాలా నరసింహునీగా ప్రసిద్ధిగాంచాడని పురాణంలో చెప్పబడినది.

స్వామి వారు శనివారం మాత్రమే భక్తులను దిర్శనమిస్తాడు. మిగిలిన ఆరు రోజులు దేవతలకు దిర్శనమిస్తాడు.

విశేషములు : ఈ కొండ పై గల మరొక వింత శ్రీ మహాలక్ష్మి స్వామి వారి పై ప్రణయకోపం తో అలిగి కొండను పగులకొట్టుకొని కొండ శిఖరము పై కూర్చున్నదని పురాణ గాధలలో చెప్పబడినట్లే బ్రాంహందమైన కొండల నడుమ చీలిక ఈరుకైన మెల్లదారి. ఈ దారిలో ఎంతటి స్తులకాయులైననూ నడచి వెళ్ళగలిగే విధముగా నుందుటాయు భక్తులకు అద్భుతం గా తోస్తుంటుంది. ఒకే ఒక రాతి క్రింద ఏర్పడిన విశాలమైన గుహలో శివలింగం ప్రతిష్టించబడి " శివకెశవులు " ఓక్కరెనన్న అధ్యాత్మిక ఉన్నత భావనను కలిగిస్తుంది. శివాలయం దిగువున పార్వతిదేవి ఆలయమున్నది. వేయేల! భారతదేశంలోని అసంఖ్యాక దివ్యక్షేత్రంలలో ఒకటిగా ఎన్నదగినదైన ఈ మలయాద్రిని జీవితంలో ఒకసారైన శ్రీ లక్ష్మీనరసింహుని శరనువేడినవారు దన్యులు . ప్రతిసంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దసి నాడు " నరసింహజయంతి " అనగా ఈ వారంలోని శనివారం నాడు ఉత్సవము దేవాస్తానము వారిచే జరుపబడుచున్నది.






































 

Route Map (From Ongole to Malakonda):



No comments:

Post a Comment